రిసెప్షన్‌కు వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్

by Disha Web Desk 4 |
రిసెప్షన్‌కు వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్
X

దిశ, బెజ్జూర్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలంలో రాత్రి రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృత్యు వాత పడ్డారు. బెజ్జూరు మండలంలోని పోతపెల్లి - కొరత గూడ గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీ కొట్టాయి. ఈ ఘటనలో అరకగూడ గ్రామానికి చెందిన ఆత్రం మహేష్, తుర్రం వెంగయ్య, ఎలుక పల్లి గ్రామానికి చెందిన దున్న నరసింహులు అక్కడికక్కడే మృతి చెందారు. ఎలకపల్లి నుండి పోతేపల్లికి పెళ్లి రిసెప్షన్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. గాయపడిన మరో ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు.



Next Story

Most Viewed