కొనసాగుతున్న రెండో దశ పోలింగ్.. పోటీలో ఉన్న ప్రముఖులు వీరే..!

by Disha Web Desk 4 |
కొనసాగుతున్న రెండో దశ పోలింగ్.. పోటీలో ఉన్న ప్రముఖులు వీరే..!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో రెండో దశ పోలింగ్ కొనసాగుతోంది. రెండో దశలో 13 రాష్ట్రాల్లో 88 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. కేరళలో మొత్తం 20 లోక్ సభ స్థానాలకు ఒకే సారి పోలింగ్ జరుగుతోంది. కర్ణాటకలో 14, రాజస్థాన్‌లో 13, యూపీలో 8 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. మహారాష్ట్రలో 8, మధ్యప్రదేశ్‌లో 6, బీహార్‌లో 5 స్థానాలకు పోలింగ్ నడుస్తోంది. అసోంలో 5, బెంగాల్‌లో 3, ఛత్తీస్‌గఢ్‌లో 3 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. జమ్ముకశ్మీర్, మణిపూర్, త్రిపురలో ఒక్కో లోక్‌సభ స్థానానికి పోలింగ్ కొనసాగుతోంది. దేశంలో రెండో విడతలో భాగంగా పలువురు ప్రముఖులు పోటీలో ఉన్నారు. కేరళ వయనాడ్ నుంచి బరిలో రాహుల్ గాంధీ, తిరువనంతపురం నుంచి శశిథరూర్, కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్, బెంగళూరు దక్షిణం నుంచి తేజస్వి సూర్య, మాండ్య నుంచి కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, యూపీ నుంచి మధుర నుంచి హేమమాలిని, రాజస్థాన్‌లోని కోటా-బూందీ నుంచి ఓ బిర్లా, రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ నుంచి గజేంద్రసింగ్ షెకావత్, ఛత్తీస్‌గఢ్ రాజ్‌నంద్‌గావ్ నుంచి భూపేష్ బఘేల్ పోటీ చేస్తున్నారు.



Next Story

Most Viewed