ఎన్నికల ఔట్ చెక్ పోస్ట్‌పై అధికారుల నిర్లక్ష్యం..!

by Disha Web Desk 23 |
ఎన్నికల ఔట్ చెక్ పోస్ట్‌పై అధికారుల నిర్లక్ష్యం..!
X

దిశ, బయ్యారం: మండలంలోని నామాలపాడు వద్ద,ఇల్లందు-మహబూబాబాద్ ప్రధాన రహదారిపై జిల్లా సరిహద్దు ఎన్నికల తనిఖీలలో భాగంగా జిల్లా పోలీసు అధికారులు పోలీసు టెంట్ ఏర్పాటు చేశారు. ఆదివారం అకార గాలి దుమ్ముకి టెంట్ కూలిపోవడంతో అక్కడ సీసీ కెమెరాలు కూడా పనిచేయడం లేదని పలువురు ద్వారా సమాచారం . జిల్లా ,మండల అధికారులు, పోలీసులు ఎన్నికల నిర్వహణకు ఎప్పటికప్పుడు ప్రధాన రహదారిపై సీసీ పుటేజీలు రికార్డు కావలసి ఉండగా,అవేమి పనిచేయకపోవడంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న ఎన్నికల సిబ్బంది అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది.

దీనిపై మండల ఎన్నికల పర్యవేక్షణ అధికారి తహశీల్దార్ సయ్యద్ ఎస్ డి సుల్తానీ వివరణ కోరగా ఈ విషయం మా దృష్టికి వచ్చిందని, పోలీస్ ఔట్ పోస్ట్ టెంట్ విషయం కూలిందని,దీనిని పునః దరణ జిల్లా పోలీసు అధికారులు చేయాలని, సీసీ కెమెరా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కార్యాలయం నకు పుటేజి లింక్ అవుతాయని నాకు సంబంధించిన విషయం కాదని బదులిచ్చారు.



Next Story