పార్క్ చేసిన బైక్‌ నుండి డబ్బులు దోచుకున్న కీలాడి లేడీలు..(వీడియో)

by Disha Web Desk 13 |
పార్క్ చేసిన బైక్‌ నుండి డబ్బులు దోచుకున్న కీలాడి లేడీలు..(వీడియో)
X

దిశ, ములుగు ప్రతినిధి: పార్క్ంగ్‌ చేసి ఉన్న బైక్‌ నుండి గుర్తు తెలియని మహిళలు భారీ మెుత్తంలో డబ్బులను దొంగిలించిన ఘటన ములుగు జిల్లా కేంద్రంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. ములుగు మండ‌లం కాసిందేవీ పేట గ్రామ స‌ర్పంచ్ అహ్మద్ పాషా ప‌ని నిమిత్తం ములుగుకు వ‌చ్చారు. ఈ క్రమంలో ములుగులోని ఒక షాప్ ముందు త‌న బైక్‌ను పార్క్ చేసి షాపింగ్ చేస్తుండ‌గా.. గుర్తు తెలియ‌ని మ‌హిళ‌లు పార్క్ చేసి ఉంచిన బైక్ బ్యాగులోంచి రూ. 2,80,000 దొంగ‌లించారు. షాపింగ్ చేసి వ‌చ్చిన ఆహ్మద్ పాషా ఇది గ‌మ‌నించి వెంట‌నే స్థానిక ములుగు పోలిస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. ములుగు సీఐ రంజిత్ కూమార్‌, ఏస్సై ఓంకార్‌ల‌తో క‌లిసి ఘ‌ట‌న స్థలానికి చేరుకుని స్థానిక మెడిక‌ల్ షాపులోని సీసీ ఫూటేజ్ ప‌రీశీలించారు. కాగా సీసీ ఫూటేజ్ ఆదారంగా ద‌ర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రంజిత్ తెలిపారు.

సీసీ ఫూటేజ్‌ వీడియో.. https://www.youtube.com/shorts/tDLIWVAJvg0


Next Story

Most Viewed