కడియం కావ్యను భారీ మెజార్టీతో గెలిపించాలి

by Disha Web Desk 15 |
కడియం కావ్యను భారీ మెజార్టీతో గెలిపించాలి
X

దిశ,వర్థన్నపేట : కడియం కావ్యను భారీ మెజార్టీతో గెలిపించడం కోసం ప్రతి కార్యకర్త సైనికులా పని చేయాలని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. శనివారం వర్థన్నపేట మున్సిపల్ కేంద్రంలో కావ్య గెలుపు కోసం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వర్థన్నపేట పేట టౌన్ అధ్యక్షుడు మైసా సురేష్, మండల అధ్యక్షుడు ఎద్దు సత్యనారాయణ, కౌన్సిలర్ సుధీర్, సీనియర్ నాయకులు అనిమిరెడ్డి కృష్ణ రెడ్డి, కమ్మగోని ప్రభాకర్ గౌడ్, పోశాల వెంకన్న, సిలువేరు శ్రీధర్, శ్రీపాద సతీష్, మండల, టౌన్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ లో భారీగా చేరికలు

పర్వతగిరి మండల జెడ్పీటీసీ బానోత్ సింగ్ లాల్ ఆధ్వర్యంలో మండలానికి చెందిన 50మంది బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే సమక్షంలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Next Story

Most Viewed