గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చేయాలి : ఆరూరి రమేష్

by Disha Web Desk 23 |
గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చేయాలి : ఆరూరి రమేష్
X

దిశ,భూపాలపల్లి : వరంగల్ పార్లమెంట్ స్థానం గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని బూత్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన బీజేపీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి ఆరూరి రమేష్. ఈ సందర్భంగా ఆరూరి రమేష్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ వరంగల్ అభ్యర్థిగా అధిష్టానం నా పేరును ప్రకటించడం సంతోషంగా ఉందని అన్నారు. ఈసారి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా కాషాయ జెండా ఎగర వేస్తామనే నమ్మకం మీ అందరిని చూస్తుంటే కలుగుతుందని ఉన్నారు. రేపటి మన తెలంగాణ భవితను మార్చబోతుంది ఈ గెలుపెనని అన్నారు. ఈ వరంగల్ సీట్ ప్రధాని నరేంద్ర మోడీకి కానుకగా ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తకు ఉందని అన్నారు.

రేపు మనం గెలవబోయే సీటు ప్రజల గెలుపుగా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల విజయంగా చరిత్రలో నిలుస్తుందని అన్నారు.కేంద్ర ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన ప్రతి ఒక్కరిని కూడా ఈ విజయంలో మనం భాగం చేయాలని అన్నారు. ప్రతి బూత్ లోని లబ్ధిదారులను నేరుగా కలిసి వారికి ప్రధాన నరేంద్ర మోడీ అందించిన పథకాలను సహకారాన్ని గురించి వివరించాలని కోరారు. ఈ ఎంపీ సీట్ మనం గెలిస్తే భూపాలపల్లికి వాణిజ్యపరంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. భూపాలపల్లి జిల్లాలో మహిళలు అధికంగా వెనుకబడి ఉన్నారు. వారికి స్వయం ఉపాధి కింద యంఎస్ యం ఈ ల కింద చిన్న, మధ్య తరహా వ్యాపారాలకు సహకారాన్ని అందిస్తామని అన్నారు.

అలాగే ఓపెన్ కాస్ట్ నిర్వాసితులకు ఇప్పటివరకు నష్టపరిహారాన్ని అందించలేదు వారికి నష్టపరిహారాన్ని అందించే వరకు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని అన్నారు. భూపాలపల్లి జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి అవకాశం వచ్చిందని అన్నారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మీ అందరిపై ఉందని అన్నారు. అందుకోసం ప్రతి ఒక్కరూ కంకణబద్ధులై భారతీయ జనతా పార్టీ కోసం కృషి చేయాలన్నారు. ఈ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురవేయడమే మన ముందున్న ఏకైక లక్ష్యం అన్నారు.ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు మోరే రవీందర్ రెడ్డి , జిల్లా అధ్యక్షుడు నిశీధర్ రెడ్డి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తి రెడ్డి ,భూపాలపల్లి జిల్లా నాయకులు, బూత్ స్థాయి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొనడం జరిగింది.


Next Story