ఏసీబీ అధికారులకు చిక్కిన డిపో మేనేజర్..

by Disha Web Desk 23 |
ఏసీబీ అధికారులకు చిక్కిన డిపో మేనేజర్..
X

దిశ, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి: ఎల్కతుర్తి మండలం పరిధిలో సోమవారం రోజున స్థానిక మన్విత హోటల్ లో డబ్బులు తీసుకుంటుండగా ఏసిబికి చిక్కిన సంఘటన చోటు చేసుకుంది. హుజూరాబాద్ డిపోకు చెందిన డ్రైవర్ తాడికొండ రవీందర్ కు డిపో మేనేజర్ శ్రీకాంత్ చార్జి మెమో ఇచ్చాడు. చార్జి మెమో ఎత్తేయడానికి రూ. 30 వేలు డిమాండ్ చేశాడు. రూ. 10 వేలు ఇచ్చినప్పటికీ మిగతా డబ్బుల కోసం డిమాండ్ చేయగా విసుగు చెంది డ్రైవర్ రవీందర్ ఏసీబీని ఆశ్రయించాడు. ఇవాళ రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా హుజూరాబాద్ డిపో మేనేజర్ శ్రీకాంత్ ని రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.


Next Story