పదిలో ఆదర్శవాణి విద్యార్థుల ప్రతిభ

by Disha Web Desk 23 |
పదిలో ఆదర్శవాణి విద్యార్థుల ప్రతిభ
X

దిశ, దుగ్గొండి: పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో దుగ్గొండి మండల కేంద్రంలోని ఆదర్శ వాణి విద్యాసంస్థల విద్యార్థులు ప్రతిభ చూపారని విద్యాసంస్థల చైర్మన్‌ నాగనబోయిన రవి తెలిపారు. 10/10 జీపీఎ తో ముగ్గురు విద్యార్థులు వి. వైష్ణవి, జి. ఐషు, ఇ. అర్చనలు ఉత్తీర్ణత సాధించి మండల టాపర్లు గా నిలిచారని తెలిపారు. 9 కి పైగా 15 మంది, 8 కి పైగా 10 మంది, 7 కి పైగా 5 మంది విద్యార్థులు జీపీఏ తో ఉత్తీర్ణత సాధించారని పాఠశాల మొత్తం విద్యార్థులు 100 % ఉత్తీర్ణత సాధించగా మండలంలో మొదటి స్థానంలో నిలిచమని చెప్పారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం, డైరెక్టర్లు భిక్షపతి, ప్రిన్సిపాల్ శశిధర చారి, తొగరు రాజు, ఇటుకాల దేవేందర్ లు అభినందించారు.

Next Story

Most Viewed