పశువుల వ్యాపారి అనుమానాస్పద మృతి

by Disha Web Desk 23 |
పశువుల వ్యాపారి అనుమానాస్పద మృతి
X

దిశ,జనగామ : పశువుల వ్యాపారి అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన లింగాల ఘనపురం మండలంలోని కుందారం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన జక్కుల సంపత్(29) వైజాగ్ తదితర ప్రాంతాల నుంచి పాడి పశువులను తీసుకువచ్చి విక్రయించేవాడని తెలిపారు. కాగా మంగళవారం ఎవరో పశువులను కొనుగోలు చేసే వ్యక్తి తో సంపత్ తన సొంత కార్లు వెళ్లినట్లు తెలిపారు. కాగా సాయంత్రం గ్రామ శివారులో ఉన్న కారులో శవం కనిపించిందన్నారు. మృతుని ముఖంపై గాయాలు ఉన్నట్లు ఎవరు కొట్టి చంపారని అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. మృతునికి భార్య మౌనిక, ఐదు నెలల పాప ఉన్నట్లు తెలిపారు..పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.



Next Story

Most Viewed