- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
నిత్య పెళ్లి కొడుకు.. ఒకరికి తెలియకుండా మరొకరిని మూడు వివాహాలు చేసుకున్న ఘనుడు..
దిశ,వరంగల్ : వరంగల్ నగరంలోని సుందరయ్య నగర్ కు చెందిన రాజేష్ హైదరాబాదులో కార్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఫిబ్రవరి 2022న నగరంలోని చార్ బౌలీకి చెందిన సుమనప్రియను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తర్వాత మే 2022న ఆంధ్రాకు చెందిన శ్రావణి నీ హైదరాబాదులో రెండో పెళ్లి చేసుకున్నాడు. మూడు నెలల అనంతరం సుందరయ్య నగర్ కు వచ్చిన రాజేష్ సుందరయ్య నగర్ కు చెందిన సారికతో ప్రేమాయణం సాగించి 2024 ఫిబ్రవరిలో తీసుకెళ్లి హైదరాబాద్ ఆర్య సమాజంలో మూడో వివాహం చేసుకున్నాడు.
వీరి ముగ్గురిని వేరు వేరు చోట్ల అద్దెకు ఉంచాడు. రాజేష్ ఇప్పుడు వీరి ముగ్గురిని కాదని కరుణ అనే యువతతో తిరుగుతుండడంతో నిన్న సుందరయ్య నగర్ కు రావడంతో సారిక తల్లిదండ్రులు రాజేష్ తో గొడవకు దిగడంతో వారి కళ్ళు తప్పి రాజేష్ పరారయ్యాడు. సారిక తల్లిదండ్రులు డయల్ 100 కు కాల్ చేయగా ఇంతేజార్ గంజ్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎవరికి విడాకులు ఇవ్వకుండా తన కూతురిని మూడో పెళ్లి చేసుకున్న రాజేష్ పై చర్యలు తీసుకొని తన కూతురిని కాపాడాలని సారిక తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.