- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
అందుకే మోడీ భయపడుతున్నారు.. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ఆంగ్ల చానెల్ ప్రతినిధితో మాట్లాడుతూ.. ప్రతిసారి ఈవీఎంలతో మోడీ ఎన్నికలు గెలుస్తున్నారన్నారు. ఈవీఎంలలో మోడీ ఏ నెంబర్ నొక్కితే అదే వస్తుందన్నారు. బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు పెడదాం అంటే మోడీ, బీజేపీ ఎందుకు భయపడుతున్నాయని ప్రశ్నించారు. నరేంద్ర మోడీ, ఈవీఎంలు ఉన్నన్ని రోజులు మీకు అధికారం దక్కదని సెంట్రల్ హాల్ లో బీజేపీ నేతలే చెబుతున్నారన్నారు. ఈవీఎం మోడీ చోటా భాయ్ కాదు కదా.. ఎందుకు వదలడం లేదని పేర్కొన్నారు. ప్రపంచం మొత్తం పేపర్ బ్యాలెట్ తోనే ఎన్నికలు నిర్వహిస్తున్నారని.. కేవలం మన దేశంలోనే ఈవీఎంలు వినియోగిస్తున్నారని రేవంత్ అన్నారు. ప్రజలకు ఈవీఎంలపై నమ్మకం పోయిందన్నారు. ఈవీఎంల మీద బీజేపీకి మాత్రమే నమ్మకం ఉందన్నారు. బీజేపీ నమ్మకంతో ఈ దేశానికి పనిలేదని.. ప్రజల నమ్మకమే తమకు ముఖ్యమన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు ఈవీఎంలతో ఎన్నికలు జరిపితే నీళ్లు ఏవో.. పాలు ఏవో తెలిపోతుందన్నారు.