రోడ్డు క్రాస్ చేస్తుండగా బైక్‌ను ఢీకొట్టిన లారీ.. వ్యక్తి స్పాట్ డెడ్

by Disha Web Desk 4 |
రోడ్డు క్రాస్ చేస్తుండగా బైక్‌ను ఢీకొట్టిన లారీ.. వ్యక్తి స్పాట్ డెడ్
X

దిశ, మాగనూరు : రోడ్డు క్రాస్ చేస్తున్న బైక్ ను లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటన మాగనూరు మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. మాగనూరు గ్రామానికి చెందిన గోపి(24) బైక్ పై రోడ్డు క్రాస్ చేస్తుండగా లారీ మితిమీరిన వేగంతో దూసుకొచ్చి ద్విచక్ర వాహానాన్ని ఢీకొట్టింది. జాతీయ రహదారిపై వాహనాలు మితిమీరిన వేగంతో రావడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని.. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరారు. ఇదే విషయమై ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రజలు, యువకులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఘటనా స్థలానికి మక్తల్ సీఐ సీతయ్య, ఎస్సై నరేందర్ చేరుకొని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై నరేందర్ తెలిపారు.



Next Story

Most Viewed