- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బిగ్ బ్రేకింగ్: తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. ఎమ్మెల్యేలు రాజయ్య, ముత్తిరెడ్డిలకు కీలక పదవులు
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వం మరో నాలుగు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది. అందుకు సంబంధించిన ఉత్తర్వులను గురువారం ప్రభుత్వం జారీ చేసింది. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటి కొండ రాజయ్యను రైతుబంధు చైర్మన్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడంతో అసంతృప్తితో ఉన్న ఆయనకు కార్పొరేషన్ బాధ్యతలను అప్పగించింది. రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. అదే విధంగా మోస్ట్ బ్యాక్ వర్డ్ క్లాసెస్ (ఎంబీసీ) డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఇటీవల కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్లో చేరిన నందికంటి శ్రీధర్ను నియమించారు.
ఈ పదవిలో ఆయన రెండేళ్లపాటు కొనసాగనున్నారు. అదే విధంగా మిషన్ భగీరథ వైస్ చైర్మన్గా ఉప్పల వెంకటేష్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన రెండేళ్లు కొనసాగుతారు. జనగాం ఎమ్మెల్యే టికెట్ను అధిష్టానం కేటాయించకపోవడంతో అసంతృప్తితో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) చైర్మన్గా నియమించింది. ఈ నియామక ఉత్తర్వులు వెంటనే అమల్లోకి రానున్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ముత్తిరెడ్డి ఈ పదవిలో రెండేళ్లపాటు కొనసాగనున్నారు.