NHపై కూలేందుకు సిద్ధంగా ఉన్న సైనింగ్ బోర్డు.. పట్టించుకోని ఆఫీసర్స్

by Disha Web Desk 4 |
NHపై కూలేందుకు సిద్ధంగా ఉన్న సైనింగ్ బోర్డు.. పట్టించుకోని ఆఫీసర్స్
X

దిశ, వైరా : వైరాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎదురుగా జాతీయ రహదారి పక్కన ఆర్‌అండ్‌బి శాఖ ఆధ్వర్యంలో గతంలో ఏర్పాటు చేసిన సైనింగ్ బోర్డు కూలేందుకు సిద్ధంగా ఉంది. ఈ బోర్డు పూర్తిగా శిథిలావస్థకు చేరి నేడో రేపో కూలిపోయే ప్రమాదం పొంచి ఉంది. జాతీయ ప్రధాన రహదారి పక్కన భద్రాచలం, సత్తుపల్లి, అశ్వారావుపేట, విజయవాడలకు దూరములను తెలిపేందుకు ఏర్పాటు చేసిన ఈ బోర్డు పూర్తిగా ఒరిగిపోయింది. ప్రస్తుతం కేవలం ఒక యాంగ్లర్ ఆధారంగానే ఈ బోర్డు పూర్తిగా ఒకవైపు ఒరిగిపోయి ఉంది. చిన్నపాటి గాలి దుమారం వచ్చినా ఈ బోర్డు జాతీయ రహదారిపై కుప్ప కూలిపోతుంది. జాతీయ రహదారిపై ఈ బోర్డు వల్ల పెను ప్రమాదం పొంచి ఉన్నా ఆర్అండ్ బీ అధికారులు కనీసం పట్టించుకోవడం లేదు. నేషనల్ హైవే ఆర్అండ్బీ అధికారులు ప్రజల ప్రాణాలకు సంకటంగా ఉన్న ఈ బోర్డును వెంటనే తొలగించాలని వాహనచోదకులు, ప్రయాణికులు కోరుతున్నారు.

Also Read.

పంట నష్ట పరిహారం అధికార పార్టీ రైతులకే..!

Next Story

Most Viewed