- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- భక్తి
- ఆరోగ్యం
- ఫోటోలు
- రాశిఫలాలు
- Job Notifications
రెడ్హ్యాండెడ్గా ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఉద్యోగులు

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: లంచం తీసుకుంటూ ఇద్దరు రెవెన్యూ అధికారులు సోమవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. మెదక్ జిల్లా శంకరంపేట ఎమ్మార్వో కార్యాలయంలో శ్రీహరి రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్నాడు. సంగాయపల్లి గ్రామానికి చెందిన పాపన్నపేట శ్రీనివాస్ అనే వ్యక్తి ఊర్లో సర్వే నెంబర్1313లో తనకు చెందిన 0.22 గుంటల భూమికి సంబంధించిన వివరాలు పట్టాదారు పాస్బుక్లో తప్పుగా రికార్డ్ అయ్యాయని, వాటిని సరి చేయించాలని చందంపేట గ్రామం వీఆర్ఏ గూడూరి తలారి సురేష్బాబును సంప్రదించాడు.
పనిచేసి పెడతానని చెప్పిన సురేష్బాబు దానికి రూ. లక్ష ఖర్చు అవుతుందని చెప్పాడు. దాంతో శ్రీనివాస్ఏసీబీ అధికారులను సంప్రదించాడు. ఈ క్రమంలో వల పన్నిన ఏసీబీ అధికారులు సోమవారం సురేష్బాబు రూ. లక్ష లంచం తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. విచారణలో రెవెన్యూ ఇన్స్ పెక్టర్ శ్రీహరి సూచనల మేరకే తాను డబ్బు తీసుకున్నట్టు సురేష్బాబు వెల్లడించాడు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు ఇద్దరిని అరెస్ట్చేసి వారి నుంచి లంచంగా తీసుకున్న డబ్బును స్వాధీనం చేసుకున్నారు.