గెలిచిన ఎంపీలతో రేవంత్ రెడ్డి జంప్.. KTR సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 4 |
గెలిచిన ఎంపీలతో రేవంత్ రెడ్డి జంప్.. KTR సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదిలాబాద్‌లో బీఆర్ఎస్ కార్యకర్తలతో నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో భారీ మార్పులు జరుగుతాయన్నారు. ముఖ్యమైన మార్పు సీఎం రేవంత్ రెడ్డిదే అన్నారు. గెలిచిన ఎంపీలతో సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్లడం ఖాయమన్నారు. ఆరుగ్యారంటీల అమలును కాంగ్రెస్ విస్మరించిందని.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.


Next Story