రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి : వికారాబాద్ ఎమ్మెల్యే

by Disha Web Desk 23 |
రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి : వికారాబాద్ ఎమ్మెల్యే
X

దిశ ప్రతినిధి, వికారాబాద్ : చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని వికారాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నియోజకవర్గంలోని దారూర్, మర్పల్లి మండల కేంద్రంలో నిర్వహించిన రోడ్ షో, కార్నర్ మీటింగ్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుండి బిజెపి ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదని, నరేంద్ర మోడీ నయవంచకుడని, మోడీ మాట విని బిజెపికి ఓటు వస్తే మన జీవితాలను కోల్పోవాల్సి వస్తుందనిఅన్నారు.

నన్ను గెలిపించినట్లే కమిట్మెంట్ తో పనిచేసి రంజిత్ రెడ్డిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు. అనంతరం ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి మాట్లాడుతూ నన్ను చేవెళ్ల ఎంపీగా మరోసారి గెలిపించండి రేపటి మీ భవిష్యత్తు నేను చూసుకుంటానని హామీ ఇచ్చారు. నన్ను గెలిపిస్తే రాష్ట్రంలోనే చేవెళ్ల ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి మీకు గిఫ్ట్ గా ఇస్తానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ, పార్లమెంట్ ఎన్నికల వికారాబాద్ నియోజకవర్గ కోఆర్డినేటర్ యాదవ్ రెడ్డి, టిపిసిసి జనరల్ సెక్రటరీ రఘువీరారెడ్డి, ధారూర్ మండల్ ప్రెసిడెంట్ విజయ భాస్కర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ ముజాఫర్, జిల్లా మైనారిటీ ప్రెసిడెంట్ అయూబ్ అన్సారీ, మాజీ జెడ్పిటిసి రాములు, మాజీ పిఎసిఎస్ చైర్మన్ హనుమంత్ రెడ్డి, మర్పల్లి మండల నాయకులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Next Story