కూలీ కుటుంబంలో మెరిసిన ఆణిముత్యం.. యూపీఎస్సీలో జాతీయస్థాయిలో 231 ర్యాంక్..

by Disha Web Desk 23 |
కూలీ కుటుంబంలో మెరిసిన ఆణిముత్యం.. యూపీఎస్సీలో జాతీయస్థాయిలో 231 ర్యాంక్..
X

దిశ, పరిగి : వికారాబాద్ జిల్లా పూడూరు మంచన్పల్లి గ్రామానికి చెందిన దయ్యాల తరుణ్ ఐఏఎస్ ఎంపికయ్యారు. కూలీ కుటుంబానికి చెందిన దయ్యాల బాబయ్య- శశికళ దంపతులకు కుమారుడు తరుణ్ యూపీఎస్సీలో తన ప్రతిభ చాటాడు. జాతీయస్థాయిలో 231 ర్యాంకు సంపాదించి ఐఏఎస్ ఎంపికయ్యారు. విద్య పేదరికం అడ్డు కాదని తరుణ్ నిరూపించాడని పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి అంటూ తరుణ్ణి సన్మానించాడు. మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి కూడా తరుణ్ణి శాలువా పూలమాలతో సత్కరించారు.

Next Story

Most Viewed