317 జీవో రద్దుకై అంబేద్కర్ విగ్రహం ముందు టీచర్ల ధర్నా

by Dishafeatures2 |
317 జీవో రద్దుకై అంబేద్కర్ విగ్రహం ముందు టీచర్ల ధర్నా
X

దిశ, బషీరాబాద్: 317 జీవోను తక్షణమే రద్దు చేయాలంటూ ఉపాధ్యాయులు మండల పరిధిలోని పలు పాఠశాలల ఉపాధ్యాయులు ఆందోళన చేశారు. అంబేద్కర్ విగ్రహం ముందు ప్లకార్డులతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. 317 జీవో వల్ల వల్ల భార్యాపిల్లలు, తల్లిదండ్రులకు దూరంగా విధులు నిర్వర్తించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే డిసెంబర్ 6ను చీకటి రోజుగా భావిస్తున్నామని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యలను అర్థం చేసుకొని సొంత జిల్లాలకు బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే జీవో 317ను రద్దు చేయాలని, ఉద్యోగుల కుటుంబాల్లో సంతోషాన్ని కలిగించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో గోపాల్, ప్రతాప్, హన్మంత్ రెడ్డి, రాంరెడ్డి, చెరుకూరి మధుకర్, రాజు, వినయ్ కుమార్, విజయ, మహేశ్వరి, స్వర్ణ, రమ్య తదితరులు ఉన్నారు.


Next Story

Most Viewed