- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
జీహెచ్ఎంసీ సిబ్బందిపై రాళ్లతో వీధి వ్యాపారుల దాడి
దిశ,రాజేంద్రనగర్: జీహెచ్ఎంసీ సిబ్బందిపై వీధి వ్యాపారులు రాళ్లతో దాడి చేశారు. ఈ సంఘటన అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సులేమాన్ నగర్ లో ఆదివారం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు.. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని సులేమాన్ నగర్ డివిజన్ పరిధిలో ప్రధాన రహదారి మీద పిల్లర్ నెంబర్ 207 దగ్గర ఫుట్ పాత్ పై అక్రమంగా కొందరు వ్యక్తులు వ్యాపారం చేస్తున్నారని, వాటిని తొలగించాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ కు ఆన్లైన్ లో ఫిర్యాదు చేశారు.
రాజేంద్రనగర్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు వాటిని తొలగించాలని ఎన్ఫోర్స్మెంట్ సిబ్బందికి సూచించారు. దీంతో అక్కడికి వెళ్లి మున్సిపల్ కార్మికులు కొబ్బరి బొండాలను ఎన్పోస్ట్మెంటు బండిలో వేస్తుంటే ఫుట్ పాత్ మీద వ్యాపారం చేసే ముగ్గురు వ్యక్తులు వచ్చి మున్సిపల్ కార్మికుల పై రాళ్లతో, కట్టెలతో, కొబ్బరి బోండాలను తీసుకొని దాడి చేశారు. దాడి చేయవద్దని ఎంత బతిమిలాడినా వినలేదు. ఈ విషయమై అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు బాధిత కార్మికులు తెలిపారు. మున్సిపల్ సిబ్బందితో దురుసుగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.