- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
శ్రీరాముడు ఏ పార్టీకి సొంతం కాదు.. అందరికీ దేవుడే : రంజిత్ రెడ్డి
దిశ,శంషాబాద్ : శ్రీ సీతారాముల ఆశీస్సులు ప్రజలపై ఉండాలని చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. శ్రీరామనవమి సందర్భంగా బుధవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నర్కుడ అమ్మపల్లి దేవాలయంలో జరిగిన సీతారాముల కళ్యాణం లో పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మండలంలోని పెద్ద షాపూర్ పాలమాకుల శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సీతారాముల కళ్యాణం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి మాట్లాడుతూ సీతారాముల కళ్యాణం ఎంతో పవిత్రమైనదని హిందువులకు అతి పెద్ద పండుగ అన్నారు. శ్రీరాముడు ఏ ఒక్క పార్టీకి సొంతం కాదని, అందరూ ఆరాధించే దేవుడు అన్నారు. రాముని పేరు చెప్పుకొని ఓట్లు అడిగే నాయకులను ఎవరు నమ్మొద్దని, ప్రజలకు మంచి చేసే ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులను ఎన్నుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గౌతమి అశోక్, నాయకులు జ్ఞానేశ్వర్ ముదిరాజ్, శేఖర్ యాదవ్, సంజయ్ యాదవ్, రమేష్, దేవేందర్, లలిత్, మల్లేష్ ప్రభాకర్ రాజు తదితరులు పాల్గొన్నారు.