విక్రయానికి తరలిస్తున్న మద్యం పట్టివేత

by Disha Web Desk 11 |
విక్రయానికి తరలిస్తున్న మద్యం పట్టివేత
X

దిశ, ఆమనగల్లు::- ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అక్రమంగా మద్యం అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమనగల్లు ఎస్సై బలరాం నాయక్ పేర్కొన్నారు. మంగళవారం ఎన్నికల కోడ్ తనిఖీల్లో భాగంగా ఆమనగల్లు పట్టణ కేంద్రం నుండి 11.5 లీటర్ల మద్యాన్ని తలకొండపల్లి మండలం వెంకటరావుపేట గ్రామానికి తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో కిరాణా షాపుల్లో మద్యం అమ్మ రాదని, అమ్మినచో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


Next Story