భారీ చోరీ... 20 తులాల బంగారం 50 తులాల వెండి అపహరణ

by Disha Web Desk 11 |
భారీ చోరీ... 20 తులాల బంగారం 50 తులాల వెండి అపహరణ
X

దిశ, రాజేంద్రనగర్ : యజమాని ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లి వచ్చేసరికి దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో నుంచి 20 తులాల బంగారం, 50 తులాల వెండి నగలను అపహరించుకు పోయిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిస్మత్పూర్ శివ సాయి నగర్ కాలనీలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. కిస్మత్పూర్ గ్రామంలోని శివ సాయి నగర్ కాలనీకి చెందిన లోకేష్ బంధువుల ఇంటికి వెళ్ళాడు.

మంగళవారం ఉదయం ఆయన తిరిగి వచ్చాడు. ఇంటి వెనక భాగంలో ఉన్న వంట రూము తాళం పగలకొట్టి ఇంట్లోకి చొరబడిన గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఇంటి లోపల ఉన్న బీరువాలో 20 తులాల బంగారంతో పాటు 50 తులాల వెండి నగలు చోరీ చేశారు. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీస్ క్లోజ్ టీం తో ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Next Story