మల్లు రవి అందరికీ సుపరిచితుడు : ఎమ్మెల్యే కసిరెడ్డి

by Disha Web Desk 11 |
మల్లు రవి అందరికీ సుపరిచితుడు : ఎమ్మెల్యే కసిరెడ్డి
X

దిశ, తలకొండపల్లి : నాగర్ కర్నూల్ పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ మల్లు రవిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఆసన్నమైందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. మండలంలోని సంఘపల్లి గేటు సమీపంలో మంగళవారం రాత్రి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డోకుర్ ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యేలు, మాజీ పార్లమెంటు సభ్యులు నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి మల్లు రవి మాట్లాడుతూ… నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మల్లు రవి గెలిపించాలని కోరారు. ఏడు అసెంబ్లీ స్థానాలకు గాను ఇప్పటికే ఐదు మంది ఎమ్మెల్యేలు విజయం సాధించి ఉన్నారని గుర్తు చేశారు.

మల్లు రవి ఈ ప్రాంతంలో అందరికీ సుపరిచితుడని, పిలిస్తే పలికే వ్యక్తి కాబట్టి అందరం కలిసికట్టుగా ఉండి కల్వకుర్తి నుంచి 25 వేల మెజార్టీకి పైగా వచ్చే విధంగా చూడాలని కసిరెడ్డి అన్నారు. కార్యకర్తలందరూ రాహుల్ గాంధీని అధికారుల్లోకి తీసుకురావడానికి సమయం ఆసన్నమైందని, ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేయాలని మల్లు రవి అన్నారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యులు శ్రీనివాస్ గౌడ్, ఆమనగల్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యాదవ నరసింహ, పిఎసిఎస్ చైర్మన్ కేశవరెడ్డి, మాజీ ఎంపీపీ రఘురాములు, నాయకులు వస్తువుల జంగయ్య, కేశవులు, నాగేష్, డేవిడ్, అంజయ్య గుప్తా, తిరుపతి రెడ్డి ,రమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed