- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మంత్రికి వినతి
దిశ ప్రతినిధి, వికారాబాద్: జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి జిల్లా జర్నలిస్టులు వినతిపత్రం అందజేశారు. శనివారం జిల్లా కేంద్రానికి వచ్చిన మంత్రి సబితా ఇంద్రారెడ్డికి టీయూడబ్ల్యూజే-ఐజేయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి శ్రీధర్, జిల్లా కోశాధికారి కె. రాఘవేందర్, నాయకులు పి. చుక్కయ్య, ప్రమోద్, నరసింహారావు తదితరులు వినతిపత్రం అందజేశారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం జిల్లాలో పర్యటించినప్పుడు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను మంజూరు చేశారు. అదేవిధంగా వికారాబాద్ జిల్లాలో కూడా జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. మంత్రితోపాటు ఎమ్మెల్యేలు డాక్టర్ ఆనంద్, కాలే యాదయ్య, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.