కాసాని జ్ఞానేశ్వర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలి : కాలే యాదయ్య

by Disha Web Desk 11 |
కాసాని జ్ఞానేశ్వర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలి : కాలే యాదయ్య
X

దిశ, షాబాద్ : చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. సోమవారం షాబాద్ మండలంలోని చందనవెల్లి గ్రామంలో కాసాని జ్ఞానేశ్వర్ కు మద్దతుగా కారు గుర్తుకు ఓటేయాలని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బిజెపి పార్టీలకు ప్రజలు ఓటు ద్వారా తగిన గుణపాఠం చెప్పాలని సూచించారు.

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, ఆరు నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తెలంగాణ ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలన కావాలని కోరుకుంటున్నారని, పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు బీఆర్ఎస్ కైవసం చేసుకోవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ప్రజలంతా కారు గుర్తుకు ఓటెయ్యాలని కోరారు.

చందనవెళ్లి లో ఇంటింటి ప్రచారం పాల్గొన్న బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ సతీమణి చంద్రకళ, షాబాద్ జడ్పిటిసి పట్నం అవినాశ్ రెడ్డి సతీమణి పట్నం సాన్వి రెడ్డి షాబాద్ మండలంలోని చందనవెల్లి గ్రామంలో సోమవారం బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కు మద్దతుగా ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటికి తిరిగి మహిళలతో మాట్లాడి కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...తెలంగాణలో కేసీఆర్ పాలనలో ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశారని తెలిపారు.

ఓట్ల కోసం లేనిపోని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి హామీలు అమలు చేయకుండా ప్రజలను ఇబ్బందులు పెడుతుందని తెలిపారు. ఈ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెప్పాలని ఓటర్లను కోరారు. కాసాని జ్ఞానేశ్వర్ గెలుపొందితే తెలంగాణ గొంతుకను పార్లమెంట్ లో వినిపిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ ఎన్నికల ఇన్చార్జ్ రాంబాబు యాదవ్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గూడూరు నర్సింగ్ రావు, మాజీ సర్పంచులు కొలను ప్రభాకర్ రెడ్డి , పోనమోని కేతన, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కృష్ణ గౌడ్, రమేష్ యాదవ్, రాందేవ్ యాదవ్, వెంకటయ్య, మల్లేష్, విష్ణు, తదితరులు ఉన్నారు.

Next Story

Most Viewed