- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
నేను నిస్వార్ధంగా సేవ చేస్తున్నాను : రంజిత్ రెడ్డి
దిశ, రాజేంద్రనగర్: తాను నిస్వార్ధంగా సేవ చేస్తున్నానని చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. ఈరోజు ఆయన తన కుటుంబ సభ్యులు, ఆప్తులతో కలిసి రాజేంద్రనగర్ లోని రిటర్నింగ్ కార్యాలయంలో మొదటి సెట్టు నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎల్లుండి సీఎం రేవంత్ రెడ్డి తో కలిసి 50,000 మంది నాయకులతో ర్యాలీగా వచ్చి మరోసారి నామినేషన్ వేయనున్నట్లు పేర్కొన్నారు.
హనుమాన్ జయంతి నేపథ్యంలో మంచి రోజు కావడంతో ఈరోజు నామినేషన్ వేసినట్లు ఆయన వెల్లడించారు. తను ఎంతో నిస్వార్ధంగా కొన్ని సంవత్సరాలుగా సేవ చేస్తున్నట్లు వివరించారు. భారీ మెజారిటీతో విజయం సాధిస్తానని ఈ సందర్భంగా ఎంపీ రంజిత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నామినేషన్ కార్యక్రమంలో తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, చేవెళ్ల కాంగ్రెస్ ఇంచార్జ్ ఇన్ భీం భరత్, కస్తూరి నరేందర్, రంజిత్ రెడ్డి భార్య సీతా రంజిత్ రెడ్డి, కుమారుడు ఆర్యన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మనవడితో సందడి
నామినేషన్ వేసిన అనంతరం ఎంపీ రంజిత్ రెడ్డి మీడియా పాయింటులో తన మనవడితో కలిసి సందడి చేశారు. చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన తన మనవడి చేతిని పైకెత్తి చూపించడంతో కార్యకర్తలు, నాయకులు సంతోషం వ్యక్తం చేశారు.