కాంగ్రెస్ గూటికి గుడిపల్లి రవికాంత్ రెడ్డి

by Disha Web Desk |
కాంగ్రెస్ గూటికి గుడిపల్లి రవికాంత్ రెడ్డి
X

దిశ, చేవెళ్ల : బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ చేవెళ్ల నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు గుడుపల్లి రవికాంత్ రెడ్డి తీర్థం పుచ్చుకున్నారు. శనివారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, నియోజకవర్గం ఇంచార్జ్ పామేనా బీమ్ భరత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సొంత గూటికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డి గెలుపునకు కృషి చేస్తానని చెప్పారు. పార్టీలో అందరితో కలిసిమెలిసి ఉంటూ పార్టీ అభివృద్ధికి పాటుపడుతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల సర్పంచ్, పీఏసీఎస్ చైర్మన్లు, మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story

Most Viewed