శ్రీవారి అభిషేక సేవలో పలువురు రాజకీయ ప్రముఖులు

by Disha Web Desk 18 |
శ్రీవారి అభిషేక సేవలో పలువురు రాజకీయ ప్రముఖులు
X

దిశ,తిరుమల: శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం వేకువజామున అభిషేక సేవలో పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. వీరిలో కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తదితరులు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి అభిషేక సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం వీరికి ఆలయ రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా, ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.

Next Story

Most Viewed