BREAKING: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నికపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు

by Disha Web Desk 19 |
BREAKING: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నికపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నికపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2022లో ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన దండె విఠల్ ఎన్నిక చెల్లదని హై కోర్టు ప్రకటించింది. ఫోర్జరీ సంతకాలతో దండె విఠల్ తన పేరిట నామినేషన్ ఉపసంహరణ పత్రాలిచ్చారని కాంగ్రెస్ నేత పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దండె విఠల్ ఎన్నిక అక్రమని, ఆయన శాసన మండలి సభ్యత్వాన్ని రద్దు చేయాలని రాజేశ్వర్ రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు.. తాజాగా దండె విఠల్ ఎన్నిక చెల్లదని తీర్పు వెలువరించింది. ఎన్నిక రద్దు చేయడంతో పాటు దండె విఠల్‌కు న్యాయస్థానం రూ.50 వేల ఫైన్ విధించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికే ఢీలాపడ్డ బీఆర్ఎస్‌ హైకోర్టు తాజా తీర్పుతో మరో ఎమ్మెల్సీ స్థానాన్ని కోల్పోయింది.

Next Story

Most Viewed