- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
అందులో నా ప్రమేయం లేదు.. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి
దిశ, మొయినాబాద్: మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై జరిగిన హత్యా ఆరోపణలపై తన ప్రమేయం ఉందన్న వార్తలపై న్యాయబద్ధంగా చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని హిమాయత్ సాగర్ లోని ఆయన ఫామ్ హౌస్ లో బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీనివాస్ గౌడ్ పై మర్డర్ ప్లాన్ జరిగిందన్న ఆరోపణలపై తన ప్రమేయం ఉందన్న వార్తలపై తక్షణమే న్యాయపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. మంత్రిపై జరిగిన మర్డర్ ప్లాన్ కు తనకు సంబంధం లేదని, కావాలని నన్ను ఇందులోకి లాగారని ఆయన తెలిపారు. తనపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
'నా ఇంటిపై దాడి చేశారు. దీనిపై మహబూబ్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తాం. మంత్రి శ్రీనివాస్ గౌడ్ మర్డర్ ప్లాన్ లో మున్నూరు రవికి, నాకు లింకు పెడుతున్నారు.. అతను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. తెలంగాణ ఉద్యమం నుండే అతనికి నాకు మంచి సంబంధం ఉంది. అతను మార్కెట్ యార్డు చైర్మన్ గా పని చేశాడు. శ్రీనివాస్ గౌడ్ తో మంచి సంబంధాలు ఉన్నాయి. ఎందుకు చంపాల్సి వచ్చిందో వారికే తెలియాలి. మా ఇంటికి ఉద్యమ కారులు ఎవ్వరు వచ్చినా నేను మర్యాద చేస్తా. అంతేగానీ ఈ హత్య కుట్రలకు నాకు సంబంధం లేదు.. ఆ అవసరం కూడా నాకు లేదు. ఈ హత్య కుట్ర ఓ డ్రామాలా ఉంది' అని జితేందర్ రెడ్డి పేర్కొన్నారు.