ముదిరాజులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండ : రంజిత్ రెడ్డి

by Disha Web Desk 11 |
ముదిరాజులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండ : రంజిత్ రెడ్డి
X

దిశ, తాండూరు : రాష్ట్రంలో ముదిరాజులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి అన్నారు. గురువారం తాండూరు పట్టణంలో ముదిరాజులతో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి లు హాజరయ్యారు. అనంతరం రంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. ముదిరాజుల సంక్షేమానికి కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉందన్నారు. అధికారంలోకి వచ్చిన మూడు నెల్లలోనే ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు. భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీతోనే ముదిరాజ్ లకు అన్ని రంగాల్లో సరైన గుర్తింపు ఉంటుందన్నారు. కాబట్టి రానున్న పార్లమెంటు ఎన్నికల్లో నాకు మద్దతుగా నిలిచి కాంగ్రెస్ పార్టీకి తాండూర్ కు అత్యధికంగా మెజారిటీ వచ్చే విధంగా ముదిరాజ్ సంఘం సభ్యులు కృషి చేయాలని కోరారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ..

తాండూరు నియోజకవర్గంలో అత్యధిక జనాభా ముదిరాజ్ సభ్యులు ఉన్నారని, నా గెలుపు లో కూడా ముదిరాజ్ సభ్యుల పాత్ర కీలకమైనది గుర్తుచేస్తున్నని అన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందన్నారు. ముదిరాజులకు అండగా కాంగ్రెస్‌ పార్టీ ఎల్లప్పుడు ఉంటుందన్నారు. తాండూరులో ముదిరాజులు అత్యధికంగా ఉన్నారని, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ సెల్ కన్వీనర్ సునీతాసంపత్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు ఉత్తమ్ చంద్, కరణం పురుషోత్తంరావు, డీసీసీబీ’ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, సర్దార్ ఖాన్, నియోజకవర్గ ముదిరాజులు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed