చిలుకూరి బాలాజీ టెంపుల్‌లో భక్తుల రద్దీ.. కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు

by Disha Web Desk 9 |
చిలుకూరి బాలాజీ టెంపుల్‌లో భక్తుల రద్దీ.. కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని చిలుకూరు బాలాజీ టెంపుల్‌లో భక్తులు పోటెత్తారు. చిలుకూరి బాలాజీ టెంపుల్ లో ఈ రోజు సంతాన ప్రాప్తి దివ్యఔషధం పంపిణీ సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. గోవింద నామ స్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగుతుంది. బాలాజీ వెంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాల సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఓఆర్ఆర్, మొయినాబాద్ మార్గాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో దాదాపు చిలుకూరులో 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రస్తుతం పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్దీకరిస్తున్నారు. ఈ ఆలయానికి భక్తులు తరచూ పెద్ద ఎత్తున వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శన చేసుకుంటారు. మ్రొక్కుగా ప్రదక్షిణలు చేస్తుంటారు. బాలాజీ స్వామిని మొక్కుకుంటే వీసా తొందరగా వస్తుందని చాలా మంది నమ్మకం. అందుకే ఇక్కడి చిలుకూరు బాలాజీని వీసా బాలాజీ అని పిలుస్తారు.

Next Story

Most Viewed