- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మన్నె శ్రీనివాస్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి : మాజీ ఎమ్మెల్యే
దిశ,దేవరకద్ర: కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన మోసపూరిత హామీలను నమ్మి మోసపోవద్దని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. గురువారం పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్ల మండల పరిధిలోని అప్పంపల్లి, తిరుమలపూర్ ,ఇస్రంపల్లి, దాసరి పల్లి గ్రామాలలో విస్తృతంగా పర్యటించి కారు గుర్తుకు ఓటు వేసి బిఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి నీ భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ తెలంగాణ తెచ్చిందే కేసీఆర్ చావు అంచుల దాకా వెళ్లి తెలంగాణ తెచ్చిండు. మీ ఆశీర్వాదంతో బీఆర్ఎస్ పార్టీ రెండు సార్లు గెలిచి తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో అగ్రస్థానంలో నిలబెట్టిందని అన్నారు.
కాంగ్రెస్ వచ్చి ఐదు నెలలైనా ఇంతవరకు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయిందని అన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు రైతులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 200 ల పింఛన్లు రూ. 2000 పెంచిన ఘనత కేసీఆర్ దే అని అన్నారు. మహిళలకు ప్రతి నెల రూ. 2500 ఇస్తామన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలైనా ఇంతవరకు ఇవ్వలేదని మొత్తం రూ 12,500 ఇస్తేనే కాంగ్రెస్ నాయకులను ఓటు అడగమని చెప్పండి అని మహిళలకు సూచించారు. కావున ఇప్పుడైనా కాంగ్రెస్ పార్టీ హామీలను నమ్మి మోసపోకుండా మన కేసీఆర్ నిలబెట్టిన బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో దేవరకద్ర నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.