బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలవి అబద్ధపు వాగ్దానాలు : రంజిత్ రెడ్డి

by Disha Web Desk 11 |
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలవి అబద్ధపు వాగ్దానాలు : రంజిత్ రెడ్డి
X

దిశ,మహేశ్వరం: బీజేపీ ,బీఆర్ఎస్ పార్టీల ఎంపీ అభ్యర్థులు అబద్దపు వాగ్దానాలు ఇస్తున్నారన్నారు. వారి మాటలు నమ్మి చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం ప్రజలు మోసపోవద్దని చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి అన్నారు. ఆదివారం మహేశ్వరం మండలంలోని నాగారం ,అమీర్ పేట్, కోళ్ల పడకల్ ,మహేశ్వరం గ్రామాలలో ప్రచారం చేశారు.అనంతరం నాగారం గ్రామానికి బీఆర్ఎస్,బిజెపి పార్టీలకు చెందిన 200 మంది కార్యకర్తలు రంజిత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి మాట్లాడుతూ...కాంగ్రెస్ పార్టీ అభివృద్ది, సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తుందన్నారు. బిజేపి పార్టీకి ఓటు వేస్తే బీసీ,ఎస్సీ ,ఎస్టీ, మైనార్టీల రిజర్వేషన్లు పోతాయన్నారు. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ విదేశాల్లో ఉన్న నల్ల ధనాన్ని తెచ్చి పేదల ఖాతాలో 15 లక్షలు వేస్తామని మోసం చేశారన్నారు. పంద్రాగస్టు లోపు రుణమాఫీ చేసి తీరుతామన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు. ఇండ్లు లేని వారికి ఇండ్లు కట్టిస్తామన్నారు.ప్రతి నియోజకవర్గంలో సంవత్సరానికి 3500 ఇండ్లను కట్టిస్తామన్నారు. డ్వాక్రా సంఘాలకు 10 లక్షలు వరకు వడ్డీ లేని రుణాలను ఇస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ పరిశ్రమలు వచ్చాయన్నారు.ఆరు గ్యారంటీలను పక్క అమలు చేసి తీరుతామన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితా హరినాథ్ రెడ్డి, నేరేళ్ల శారద, మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేఎల్ఆర్ ,పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Next Story