అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటాం

by Disha Web Desk 15 |
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటాం
X

దిశ, మాచారెడ్డి : అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. మాచారెడ్డి మండలంలోని సో మార్ పేట, ఎల్లంపేట గ్రామాల్లో ఆయన శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడారు. వడగళ్లతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వ నిర్ణయం మేరకు నష్టపరిహారం అందిస్తామన్నారు. కల్లంలో నుండి ధాన్యం కొట్టుకుపోయిన రైతులకు సానుభూతితో ప్రత్యేక గ్రాంట్ అందించాలని కలెక్టర్ ను ఫోన్ లో కోరారు. బలమైన గాలులకు ఆవాసాల రేకులు కొట్టుకుపోయి నష్టపోయిన బాధితులకు తన వంతు సాయంగా రెండు వేల రూపాయల చొప్పున అందించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed