సోమార్ పేటలో వర్ష బీభత్సం

by Disha Web Desk 15 |
సోమార్ పేటలో వర్ష బీభత్సం
X

దిశ,మాచారెడ్డి : కామారెడ్డి జిల్లాలో మాచారెడ్డి మండలం సోమార్ పేట గ్రామంలో శుక్రవారం ఉదయం ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులతో కురిసిన వర్షానికి కల్లాల్లో ఆరబోసిన ధాన్యం రాసులు వరదల్లో కొట్టుకుపోయాయి. ఈదురు గాలుల ధాటికి వృక్షాలు నేలకొరిగాయి. వ్యవసాయ బావి వద్ద గల మామిడి చెట్టు కింద ఉంచిన ట్రాక్టర్ పై మామిడి చెట్టు విరిగి పడడంతో రవి అనే రైతు నష్టపోయాడు. విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. వడగళ్లకు కోతకొచ్చిన వరి పంట పూర్తిగా నేల రాలిపోయింది. ఆవాస ప్రాంతాల్లో రేకులు కొట్టుకుపోయి ధ్వంసం అయ్యాయి. గంట సమయంలోనే వర్ష బీభత్సం భారీ నష్టాన్ని చేకూర్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఆదుకొని ఆర్థిక సహాయం అందించాలని కోరారు.

Next Story