ఆశీర్వదించండి...సేవకుడిగా పనిచేస్తా

by Disha Web Desk 15 |
ఆశీర్వదించండి...సేవకుడిగా పనిచేస్తా
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఆశీర్వదించండి...సేవకుడిగా పనిచేస్తా అని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్న జీవన్ రెడ్డి , రాజ్యసభ సభ్యులు కే.ఆర్ సురేష్ రెడ్డి , నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ల ఆధ్వర్యంలో ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట్ లో నిజామాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ...ఆశీర్వదించండి సేవకుడిగా పనిచేస్తా పార్లమెంట్ సమావేశాలు నడిచినప్పుడు ఢిల్లీకి.. మిగతా రోజులు నిజామాబాద్ జిల్లా ప్రజల వద్దనే ఉంటా అన్నారు. అసెంబ్లీ ఎలక్షన్లో ప్రజలు దురాశకు పోయి కష్టాలు కొని తెచ్చుకున్నారు... కాంగ్రెస్ అబద్ధ ప్రచారాలను నమ్మి మోసపోయారు అని అన్నారు.

కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఎక్కడ, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు ఎక్కడ, మూడు పంటలకు ఇస్తానన్న రైతుబంధు ఎక్కడ, 24 గంటల కరెంటు ఎక్కడ, రెండు లక్షల రుణమాఫీ ఎక్కడ అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ 420 హామీలతో ప్రజలకు అబద్ధం చెప్పి అధికారం ఎక్కారని, ప్రజలను అరిగోస పెడుతున్నారు అన్నారు. వడ్లకు అదనంగా 500 బోనాస్ ఇచ్చి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామన్నారు ఇంతవరకు లేదని, రైతులకు కరెంటు లేక బోరుబావులు వట్టిపోయి పంటలు ఎండిపోయి రైతన్నలు హరిగోస పడుతున్నారని తెలిపారు. స్థానికంగా ఉన్న ఎంపీ నిజామాబాద్ జిల్లాలో చేసింది శూన్యం అన్నారు. ఐదు రోజుల్లో తెస్తానన్న పసుపు బోర్డు ఐదు సంవత్సరాలు గడిచిపోయిందని, ఇంకా రాలేదని, కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాటలు నమ్మి మరోసారి మోసపోవద్దని కోరారు. వారికి పార్లమెంట్ ఎన్నికలలో ప్రజలు ఓటుతో బుద్ధి చెబుతారు అన్నారు.


Next Story