ఐదోరోజు 16 నామినేషన్లు

by Disha Web Desk 15 |
ఐదోరోజు 16 నామినేషన్లు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గ స్థానానికి ఐదవ రోజు మంగళవారం పదహారు (16 ) నామినేషన్లు దాఖలు అయ్యాయని రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. బహుజన్ లెఫ్ట్ పార్టీ అభ్యర్థిగా అశోక్ గౌడ్ అబ్బగోని, ఆలిండియా బీసీ ఓబీసీ పార్టీ అభ్యర్థిగా పోతు నవీన్, ప్రజా సేన పార్టీ అభ్యర్థిగా పోతు నాగార్జున్, ఆలిండియా నేషనల్ పార్టీ అభ్యర్థిగా ఎండీ. షాహెద్ ఖాన్, దళిత బహుజన పార్టీ అభ్యర్థిగా గోలి నరేష్ నామినేషన్లు సమర్పించారని వివరించారు. స్వతంత్ర అభ్యర్థులుగా కొత్తకొండ శక్తిప్రసాద్, బీ.బీ.నాయక్,

మహమ్మద్ జమీల్, జి.సాయికృష్ణ మూర్తి నామినేషన్ లు వేశారని అన్నారు. అలాగే ఇప్పటికే స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన రాపెల్లి సత్యనారాయణ రెండవ సెట్ ను, రాపెల్లి శ్రీనివాస్ మూడవ సెట్ నామినేషన్ పత్రాలను సమర్పించారని తెలిపారు. ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థిగా కండెల సుమన్ కూడా మూడవ సెట్ నామినేషన్ దాఖలు చేశారని అన్నారు. వీరితో పాటు అలయెన్స్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ అభ్యర్థిగా యుగంధర్ గట్ల, యుగ తులసి పార్టీ అభ్యర్థిగా కోటగిరి శ్రీనివాస్, విద్యార్థుల రాజకీయ పార్టీ అభ్యర్థిగా భూక్య నందు మూడవ సెట్, స్వతంత్ర అభ్యర్థిగా కాట్రాజి ప్రశాంత్ రెండవ సెట్ నామినేషన్లు వేశారని వివరించారు. కాగా నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ స్థానానికి ఇప్పటివరకు 26 మంది అభ్యర్థులు మొత్తం 44నామినేషన్లు దాఖలు చేశారని రిటర్నింగ్ అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు.



Next Story

Most Viewed