అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే భాస్కర్ రావు

by Disha Web Desk 11 |
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే భాస్కర్ రావు
X

దిశ, మిర్యాలగూడ: మండల పరిధి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో 20 గ్రామాల పరిధిలో మంజూరైన రూ. 3కోట్ల 80 లక్షల అభివృద్ధి పనులకు మంగళవారం ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల సమగ్ర అభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యం అన్నారు. విస్తృత నిధులతో గ్రామాల్లో గ్రామ పంచాయతీ భవనాలు, సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టానున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహ రెడ్డి, ఎంపీపీ నూకల సరళ హనుమంత రెడ్డి, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, చిట్టిబాబు నాయక్, అమరావతి సైదులు, ఏడుకొండలు, వేలిశెట్టి రామకృష్ణ, సైదులు యాదవ్, డీఈ వెంకటేశ్వర్ రావు, ఎంపీడీవో జ్యోతిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


Next Story