మంట కలిసిన మానవత్వం...రైల్వే ట్రాక్ పై పసికందు మృతదేహం

by Disha Web Desk 15 |
మంట కలిసిన మానవత్వం...రైల్వే ట్రాక్ పై పసికందు మృతదేహం
X

దిశ,నల్లగొండ : నల్లగొండ జిల్లా కేంద్రంలో మానవత్వం మంట కలిసింది. అప్పుడే పుట్టిన పసికందు మృతదేహాన్నితండ్రి రైల్వే ట్రాక్ మీద వదిలి వెళ్లాడు. ప్రభుత్వ ఆసుపత్రికి ప్రసవానికి నార్కట్ పల్లి మండలంలోని తొండల్వాయి గ్రామానికి చెందిన నవిత గత పది రోజుల క్రితం వచ్చారు. ఈమెకు ఇద్దరు కవలలు జన్మించారు. ఇద్దరూ అమ్మాయిలే. అనంతరం నిన్న సాయంత్రం ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక పాన చనిపోయింది. దాంతో తండ్రి శేఖర్ పాప మృతదేహాన్ని నల్లగొండలోని పానగల్లు

బ్రిడ్జి కింద ఉన్న రైల్వే ట్రాక్ పై వదిలి వెళ్లాడు. శనివారం ఉదయం రైల్వే ట్రాక్ మాన్ చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్ఐ కె.సాలకమ్మ, హెడ్ కానిస్టేబుల్ డి.రజిత సంఘటన స్థలానికి చేరుకొని పాప మృతదేహాన్ని నల్లగొండలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. ఆసుపత్రి సిబ్బంది ఆ పాప నిన్న సాయంత్రం మే చనిపోయింది అని తెలపడంతో తల్లిదండ్రుల వివరాలు తెలుసుకున్నారు. పాప తండ్రి శేఖర్ ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Next Story