పాలిటెక్నిక్ కళాశాలలో సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

by Disha Web Desk 11 |
పాలిటెక్నిక్ కళాశాలలో సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
X

దిశ, నాగార్జునసాగర్ : నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ పైలాన్ కాలనీలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 2024- 25 విద్యా సంవత్సరానికి గాను వివిధ కోర్సుల్లో సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఐలయ్య తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఏప్రిల్ 22 వరకు దరఖాస్తులు చేసుకోవాలని పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్ష మే 24న నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఒకటిగా పేరుగాంచిన నాగార్జునసాగర్ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రతి సంవత్సరం వివిధ కోర్సుల్లో విద్యార్థులు పెద్ద ఎత్తున చేరుతున్నారని ఆయన తెలిపారు. సాంకేతిక విద్య కున్న ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో ఉద్యోగ పరంగా ఎంతో ప్రాముఖ్యత గాంచిన పాలిటెక్నిక్ సాంకేతిక విద్య నిరుద్యోగ యువతీ యువకుల భవిష్యత్తుకు మార్గదర్శనం చూపిస్తుందని ప్రిన్సిపాల్ అన్నారు.

నాగార్జునసాగర్ పైలాన్ కాలనీ లో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో గల మొత్తం ఒక్కొక్క కోర్సులో 60 సీట్లు చొప్పున ఖాళీలు ఉన్నాయని వీటి కోసం ప్రభుత్వం సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 22 వరకు దరఖాస్తులు చేసుకునే అవకాశం కల్పించిందని ప్రిన్సిపాల్ ఐలయ్య తెలిపారు. వంద రూపాయల అపరాధ రుసుముతో ఏప్రిల్ 24 తేదీ వరకు దరఖాస్తులు సమర్పించే అవకాశం ఉందని, 300 రూపాయల అపరాధ రుసుముతో ఏప్రిల్ 26 వరకు పాలిటెక్నిక్ ఎంట్రన్స్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు




Next Story

Most Viewed