లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే.. రోహింగ్యాలకు అడ్డాగా భారత్: ఎంపీ అర్వింద్

by Disha Web Desk 19 |
లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే.. రోహింగ్యాలకు అడ్డాగా భారత్: ఎంపీ అర్వింద్
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్ని్కల పాంచ్ న్యాయ్ మేనిఫెస్టోపై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీది ప్రమాదకర మేనిఫెస్టో అని విమర్శించారు. ముస్లింలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని.. దేశ సంపదను వారికి దోచే పెట్టేలా ఆ మేనిఫెస్టో ఉందని విమర్శలు గుప్పించారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే.. భారత్ రోహింగ్యాలకు అడ్డాగా మారుతోందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను తెలంగాణ ప్రజలు మర్చిపోతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఒక ఫ్రస్టేటెడ్ ఫాదర్ అని అభివర్ణించారు.



Next Story

Most Viewed