మోడీ జీ ఆ గ్యారెంటీ కూడా ఇస్తున్నారు!.. ఘంటా చక్రపాణి సెటైర్

by Disha Web Desk 5 |
మోడీ జీ ఆ గ్యారెంటీ కూడా ఇస్తున్నారు!.. ఘంటా చక్రపాణి సెటైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్, ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి రాజకీయాలపై ఎక్కువగా రాజకీయాలపై పోస్టులు పెడుతుంటారు. ఈ నేపధ్యంలోనే పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ప్రచారంలో బీజేపీ ఇచ్చే గ్యారెంటీలపై ఆయన ఆసక్తికర ట్వీట్ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోడీ మాట్లాడుతూ హనుమాన్ చాలీసా పారాయణం కూడా నేరమే అవుతోంది. నిర్భయంగా చాలీసా పారాయణం చేసే గ్యారెంటీ బీజేపీ ఇస్తోందని చెబుతాడు. దానికి సంబందించి ఓ ప్రముఖ టీవీ చానెల్ ప్రసారం చేస్తున్నప్పుడు తీసిన ఫోటోలను ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు. దీనిపై ఆయన కొందరు భయం వేసినప్పుడు హనుమాన్ చాలీసా చదువుతుంటారు. మోడీ జీ ఆ గ్యారెంటీ ఇస్తున్నారు..! అంటూ ట్విట్టర్ వేదికగా సెటైర్ వేశారు.



Next Story

Most Viewed