లండన్‌కు ఎమ్మెల్సీ కవిత.. మహిళల భాగస్వామ్యంపై కీలకోపన్యాసం

by Disha Web Desk 19 |
లండన్‌కు ఎమ్మెల్సీ కవిత.. మహిళల భాగస్వామ్యంపై కీలకోపన్యాసం
X

దిశ, తెలంగాణ బ్యూరో: పబ్లిక్ పాలసీకి సంబంధించి బ్రిడ్జ్ ఇండియా స్వచ్ఛంద సంస్థ ఆహ్వానం మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం రాత్రి లండన్‌కు బయలుదేరి వెళ్లారు. లండన్‌లోని సెంట్రల్ హాల్ వెస్ట్ మినిస్టర్‌లో రేపు(శుక్రవారం) "మహిళా రిజర్వేషన్ చట్టం - ప్రజాస్వామ్య ప్రక్రియలో మహిళల భాగస్వామ్యం" అనే అంశంపై బ్రిడ్జ్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో జరగనున్న సమావేశంలో ఆమె కీలకోపన్యాసం చేయనున్నారు.

చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ల కోసం జరిగిన ఉద్యమ తీరుతెన్నులు, ఈ రిజర్వేషన్ల ద్వారా జరగబోయే మేలు, చట్టసభల్లో ప్రజాస్వామ్య ప్రక్రియలో మహిళల భాగస్వామ్యం పెంచడం, రాజకీయాల్లో మహిళల పాత్ర వంటి అంశాలపై మాట్లాడనున్నారు. శనివారం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ అండ్ అలుమిని యూనియన్ యూకే నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశంలోనూ ఎమ్మెల్సీ పాల్గొని ప్రసంగించనున్నారు.

Next Story

Most Viewed