నేషనల్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా మంత్రి శ్రీధర్ బాబు

by Disha Web Desk 12 |
నేషనల్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా మంత్రి శ్రీధర్ బాబు
X

దిశ, తెలంగాణ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. నేషనల్ మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేస్తూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్​ కుమార్ గౌడ్ ఆదేశాలు ఇచ్చారు. చైర్మన్‌గా మంత్రి శ్రీధర్ బాబు, కన్వీనర్ గా ప్రోఫెసర్ అల్దాస్ జానయ్య, సభ్యులుగా శ్యాం మోహన్, కమలాకేరా రావు, బీఎం వినోద్ కుమార్, రియాజ్, జానక్ ప్రసాద్ లను నియమించారు. ఈ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ఏ విధంగా మేనిఫెస్టోను చేరవేయాలనేదానిపై అన్వేషించి పార్టీకి రిపోర్టు ఇస్తుంది. ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్తే పార్టీకి బెన్ ఫిట్ ఉంటుంది? కాంగ్రెస్ పార్టీకి ఎలా మద్దతు లభిస్తుంది? లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలిచేందుకు మేనిఫెస్టో ప్రభావం ఎంత వరకు ఉంటుంది? అనే తదితర అంశాలపై ఈ కమిటీ అధ్యయనం చేసి పదిహేను రోజుల్లో పార్టీకి నివేదికను సమర్పిస్తున్నది.


Next Story