- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రిజర్వేషన్లను టచ్ చేస్తే.. తొడ్కలు తీస్తాం.. బీజేపీకి మంత్రి పొన్నం స్ట్రాంగ్ వార్నింగ్
దిశ, వెబ్డెస్క్: ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయాల్లో రిజర్వేషన్ల అంశం హాట్ టాపిక్గా మారింది. ఈ క్రమంలో రిజర్వేషన్ల ఇష్యూపై మంత్రి పొన్నం ప్రభాకర్ రియాక్ట్ అయ్యారు. సోమవారం గాంధీ భవన్లో కురుమల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశంలో పొన్నం మాట్లాడుతూ.. బీజేపీ రిజర్వేషన్లను టచ్ చేస్తే తొడ్కలు తీస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రిజర్వేషన్లపై బీజేపీ నేతలు మాట్లాడితే తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. బీజేపీ లీడర్లు ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. బీజేపీ కుట్రలను ప్రజలు గమనించారని.. లోక్ సభ ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని అన్నారు. మోడీ మళ్లీ గెలిస్తే భారత్ను మరో పాకిస్థాన్లా మారుస్తారంటూ ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. బీజేపీ బీసీలకు వ్యతిరేక పార్టీ అని.. అందుకే రిజర్వేషన్లను ఎత్తివేయాలని చూస్తుందని ఆరోపించారు. బీజేపీకి 400 సీట్లు వస్తే.. బీసీలు ఆగమేనని కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాముణ్ణి నమ్ముకొని రాజకీయం చేస్తుందని ఫైర్ అయ్యారు. బీసీ వ్యతిరేక బీజేపీకి ఎన్నికల్లో తగిన బుద్ధి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.