‘నాకు అన్నం పెట్టే వారు’.. ముస్లింలపై మరోసారి మోడీ షాకింగ్ కామెంట్స్..!

by Mamatha |
‘నాకు అన్నం పెట్టే వారు’.. ముస్లింలపై మరోసారి మోడీ షాకింగ్ కామెంట్స్..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ ముస్లింలపై ప్రధాని మోడీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మోడీ మాట్లాడుతూ.. తానెప్పుడు ఓటు బ్యాంకు రాజకీయాలు చేయానని అన్నారు. చిన్నప్పుడు మా ఇంటి చుట్టుపక్కల ఎన్నో ముస్లిం కుటుంబాలు ఉండేవి అని తెలిపారు. ఈ క్రమంలో తన చిన్ననాటి మెమొరీస్ గుర్తు చేసుకొని సంతోషించారు. నాకు ఎంతో మంది ముస్లిం స్నేహితులు ఉన్నారని, చిన్నప్పుడు ఈద్ రోజున ముస్లిం స్నేహితులే అన్నం పెట్టేవారని గుర్తు చేసుకున్నారు. హిందూ-ముస్లిం అంటూ తేడా చూపడం ప్రారంభించిన రోజు.. ప్రజా జీవితంలో ఉండే అర్హత నాకు ఉండదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక, ప్రధాని మోడీ మూడవ సారి వారణాసి పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు 14వ తేదీన మోడీ నామినేషన్ దాఖలు చేశారు. ఐదో విడతలో భాగంగా ఈ నెల 25న వారణాసి లోక్ సభ స్థానానికి ఎన్నికలు జరగునున్నాయి.

Next Story

Most Viewed