బిడ్డా KCR నిన్ను నీ పార్టీని మూడు నెలల్లో బొంద పెడతాం.. మంత్రి కోమటిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు

by Disha Web Desk 4 |
బిడ్డా KCR నిన్ను నీ పార్టీని మూడు నెలల్లో బొంద పెడతాం.. మంత్రి కోమటిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, నల్లగొండ బ్యూరో : బిడ్డా.. కేసీఆర్ నిన్ను నీ పార్టీని మూడు నెలల్లో రాజకీయంగా బొంద పెడతామని రోడ్లు భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం నల్లగొండలో మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ మా పార్టీని టచ్ చేసి చూడు.. మా పార్టీ వీర సైనికులే నీ పార్టీని పునాదులు లేకుండా చేస్తారు.. గుర్తుపెట్టుకో బిడ్డా.. అంటూ కేసీఆర్ కు హెచ్చరిక జారీ చేశారు. గత కొద్ది రోజులుగా నీ కొడుకు కేటీఆర్ ఇలాంటి మాటలే మాట్లాడుతుంటే బచ్చాగాడు రాజకీయాలు తెలియవు పోనీలే అని ఊరుకుంటున్నాం.. ఇప్పుడు నువ్వు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తానని మాట్లాడడం నీ మూర్ఖత్వానికి అర్థం పడుతుందన్నారు. ఓ పాస్ పోర్ట్ దొంగవు నువ్వు సీఎం కాగా లేనిది.. కష్టపడి సీఎం పదవిని అలంకరించిన రేవంత్ రెడ్డికి నీకు పోలికా అంటూ ఎద్దేవా చేశారు.

రేవంత్ రెడ్డికి మొఖం చూపించలేక రెండు సార్లు అసెంబ్లీ సమావేశాలు అయితే సమావేశాలకు రాని దొంగవు నువ్వు. నువ్వు.. నీ కొడుకు నీ అల్లుడి తీహార్ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. కేసీఆర్‌ను చూస్తే జాలేస్తుందని అయినా బుద్ధి రాకపాయ అన్నారు. కనీసం బిడ్డకు బెయిల్ తెచ్చుకునే ప్రయత్నం చేయాలని.. ఈ పనికిరాని మాటలు ఎందుకు మాట్లాడుతున్నావని మంత్రి అన్నారు. మేం తలచుకుంటే 30 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడో చేరేవారని అన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు కూడా మీ పార్టీకి రాదని మంత్రి ఛాలెంజ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి 13 నుంచి 14 ఎంపీ సీట్లు రావడం ఖాయమని, జూన్ 5 తారీఖు నుంచి ప్రభుత్వ పాలనపై దృష్టి పెడతామని ఆయన అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో జెడ్పిటిసి వంగూరు లక్ష్మయ్య, పట్టణ పార్టీ అధ్యక్షులు గుమ్ముల మోహన్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Next Story

Most Viewed