దేశంలో అన్ని వర్గాల అభివృద్ధి కేవలం బీజేపీ తోనే సాధ్యం : ఈటల

by Disha Web Desk 23 |
దేశంలో అన్ని వర్గాల అభివృద్ధి కేవలం బీజేపీ తోనే సాధ్యం : ఈటల
X

దిశ, కాప్రా: మల్కాజ్గిరి పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ ప్రచారానికి ఉప్పల్ నియోజక వర్గంలో అనూహ్య స్పందన లభిస్తుంది. గురువారం ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని కాప్రా సర్కిల్ ఏఎస్ రావు నగర్, చర్లపల్లి డివిజన్ లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్వి ఎస్ ఎస్ ప్రభాకర్,మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డితో కలిసి ఈటల రాజేందర్ ప్రచారం నిర్వహించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుపుకు కృషి చేయాలని స్థానిక ఓటర్లను కోరారు.

ప్రజా సమస్యల పరిష్కారం కేవలం బిజెపితోనే సాధ్యమని అన్నారు. నియోజవర్గంలో ఇక్కడి సమస్యలు అక్క డే ఉన్నాయని ఆరోపించారు.ప్రజా సమస్యలను పరిష్కరించడంలో గత పాలకులు పూర్తిగా విఫలం అయ్యారని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందని అన్నారు.దేశంలో అన్ని వర్గాల అభివృద్ధి కేవలం బీజేపీ తోనే సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో కాప్రా సర్కిల్ బీజేపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు .



Next Story

Most Viewed